మేడ్చల్ జోన్ బృందం, ఆగస్టు 15 : నియోజకవర్గ వ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. మేడ్చల్, శామీర్పేట, ఘట్కేసర్, కీసర, మూడుచింతలపల్లి మండలాలతో పాటు మున్సిపాలిటీల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలల్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. వివిధ గ్రామ పంచాయతీల్లో ఆయా గ్రామ సర్పంచులు జెండాను ఎగురవేశారు. మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల చైర్పర్సన్ దీపికానర్సింహా రెడ్డి, మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి మల్లారెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
మేడ్చల్ పట్టణంలోని న్యూ లిటిల్ లిల్లీ హైస్కూల్ విద్యార్థులు కరస్పాండెంట్ మంజులాప్రకాశ్ ఆధ్వర్యంలో పాఠశాల నుంచి కేఎల్ఆర్ వెంచర్లోని శివాజీ విగ్రహం కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. సాంస్కృతిక ప్రదర్శనలు, స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణతో ఆకట్టుకున్నారు. చైర్పర్సన్ దీపికానర్సింహా రెడ్డి, వైస్ చైర్మన్ రమేశ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. శ్రీరంగవరం పీహెచ్సీలో వైద్యాధికారి శైలజ వేడుకలు నిర్వహించారు.
జవహర్నగర్ కార్పొరేషన్ కార్యాలయంలో జెండా ఎగురవేస్తున్న మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, కమిషనర్ జ్యోతిరెడ్డి