దుండిగల్/కుత్బుల్లాపూర్/గాజులరామారం, ఆగస్టు 15 : భారత స్వాతంత్య్ర వేడుకలు సోమవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం, కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్లతో పాటు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, దుండిగల్, కొంపల్లి మున్సిపాలిటీ పరిధుల్లోని వీధులన్నీ మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. ఉప్పొంగిన దేశభక్తితో ప్రజలు తమ ఇండ్లపై జాతీయ జెండాలను ఎగురవేసి వందనాలు తెలిపారు.
జంట సర్కిళ్ల ప్రాంగణంలో ఎమ్మెల్యే వివేకానంద్ , దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు శంభీపూర్ రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదే విధంగా నిజాంపేట కార్పొరేషన్ కార్యాలయంతో పాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జాతీయ జెండాలను మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి ఎగురవేయగా, దుండిగల్ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో చైర్పర్సన్ సుంకరిక్రిష్ణవేణికృష్ణ, కొంపల్లి మున్సిపాలిటీ కార్యాలయ ప్రాంగణంలో చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండావందనం చేశారు.
భరతమాత వేషదారణలో చిన్నారులు
రంగారెడ్డినగర్ డివిజన్లో జెండావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్రాజు, కార్పొరేటర్లు విజయ్శేఖర్గౌడ్, జగన్, మంత్రి సత్యనారాయణ, తదితరులు