ఎల్బీనగర్ జోన్బృందం, ఆగస్టు 15 : దేశభక్తి ఉట్టిపడింది.. జాతీయభావం తొణికిసలాడింది. మది నిండా మువ్వన్నెల జెండా మురిసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా జెండా పండుగను ఘనంగా నిర్వహించారు.
ఆయా ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, కాలనీ సంక్షేమ భవనాల్లో జెండాలు ఆవిష్కరించారు. ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ జెండాలను ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు.
కొత్తపేట డివిజన్ ఆర్టీసీ కాలనీలో.. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విశ్వేశ్వర్రావు, మాజీ కార్పొరేటర్ సాగర్రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు లింగాల రాహుల్గౌడ్ తదితరులు
రాక్టౌన్కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధుడు చంద్రప్రకాశ్ రావును సన్మానిస్తున్న నాగోల్ కార్పొరేటర్ చింతల అరుణ, చిత్రంలో కాలనీ అధ్యక్షుడు పి.సుదర్శన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి నారాయణ కృష్ణ, ఉపాధ్యక్షుడు కొండల్రెడ్డి, చింతల సురేందర్ యాదవ్, కాలనీ ప్రతినిధులు జగన్నాథం, లక్ష్మయ్య, దేవయ్య తదితరులు