సిటీబ్యూరో, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : శంషాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానశ్రయం(Shamshabad Airport) వద్ద గరిష్ఠ వేగ పరిమితిని(Increased speed) గంటకు 60 కిలో మీటర్ల నుంచి 80 కిలోమీటర్లకు పెంచుతున్నట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర(Stephen Ravindra) సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గాలక్సీ మెయిన్ గేట్ నుంచి ఎయిర్ పోర్టు రేర్ గేట్ వరకు ఆరు కిలోమీటర్ల వరకు 60 అడుగుల రోడ్డు బాగుందని, మీడియన్లు కూడా ఉన్నాయని తెలిపారు. వేగ పరిమితి పెంచిన రూట్లో ఆటోమెటిక్ స్పీడ్ గుర్తింపు బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ డాటా నేరుగా స్పీడ్ను గుర్తించే కెమెరాలతో పోలీస్ డేటాకు అనుసంధానమై ఉంటుందన్నారు. స్పీడ్ పెంచేందుకు ఆయా విభాగాలు సైతం సానుకూలంగా స్పందించాయని సీపీ వెల్లడించారు.