పీర్జాదిగూడ, సెప్టంబర్ 8: ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ రాల ప్రకారం… బోడుప్పల్ ఎన్ఐఎన్ కాలనీలో నివాసం ఉంటున్న రాజు కూతురు స్వప్న స్థానికంగా ఓ షాపింగ్ మాల్లో సేల్స్గర్ల్గా పని చేస్తుంది.
ఈ నెల 6న మ ధ్యాహ్నం రోజు మాదిరిగా మాల్కు వె ళ్తున్నానని చెప్పి తిరిగి రాలేదు. దీంతో కు టుంబసభ్యులు ఆచూకీ కోసం వెతికిన ఫలితం లేకపోవడంతో మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.