సిటీబ్యూరో, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ ): గ్రేటర్ హైదరాబాద్లో వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూతనందించి, వారిలో జీవన ప్రమాణాలను పెంపొందించడంలో జీహెచ్ఎంసీ ప్రత్యేక పాత్రను పొషిస్తున్నది. వీధి వ్యాపారులకు రుణాల అందజేతలో ప్రతి విడతలో మెరుగైన ప్రదర్శనను రాబడుతున్నది. ఇందులో భాగంగానే మూడవ విడతలో 5346 మందికిగానూ రూ.26.38 కోట్ల మేర రుణాలను అందజేసింది. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అమలు చేస్తున్న వీధి వ్యాపారుల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి పీఎం సురక్ష బీమా యోజన, జీవనజ్యోతి బీమా యోజన, శ్రమయోగి మందన్ పింఛన్ యోజన, మాతృవందన యోజన, జననీ సురక్ష యోజన, జన్ధన్ యోజన, వన్ నేషన్ వన్ కార్డు తదితర పథకాలను మరింత పకడ్బందీగా అందించేందుకు వీధి వ్యాపారుల పూర్తి వివరాలతో కూడిన సమాచారాన్ని పొందుపర్చేందుకు వెబ్ ఆధారిత ప్రత్యేక సమగ్ర యాప్ను రూపొందించింది. ఇందులో భాగంగానే వీధి వ్యాపారులను చైతన్యం చేసే వారికి ప్రభుత్వ పథకాలు వర్తింపజేసేందుకు ‘మైబిడిజిటల్’ అనే కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా డిజిటల్ పేమెంట్స్ను ప్రోత్సహిస్తున్నారు. వీటితో పాటు వీధి వ్యాపారులతో స్విగ్గీ, జొమోటోలు ఒప్పందం కుదుర్చుకుంటుండటం గమనార్హం.
స్ట్రీట్ వెండర్స్ వివరాలు..
రుణాల పంపిణీ వివరాలు..