నాంపల్లి కోర్టులు, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : నకిలీ పాస్పోర్టు కేసులో మీసేవ యజమాని, ఇద్దరు ఏఎస్ఐలను రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. యూసుఫ్గూడలో కళ్యాణ్ అనే వ్యక్తి 2008లో మీసేవ సెంటర్ను ప్రారంభించాడు. ఈ క్రమంలో అబ్దుల్ సత్తార్తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు కలిసి నకిలీ సర్టిఫికెట్లను రూపొందించి శ్రీలంక జాతీయులకు విక్రయించారు. పాస్ పోర్టు విచారణ కోసం వచ్చిన మారేడ్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తిప్పన్న, పంజాగుట్ట ట్రాఫిక్ ఏఎస్ఐ షేక్నజీర్ బాషా అక్రమాలకు పాల్పడినట్లు తేలింది.
దీంతో మంగళవారం 6వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీ అధికారులు ముగ్గురిని అరెస్టు చేసి లక్డీకాపూల్ కార్యాలయానికి తరలించి విచారించిన అనంతరం కోర్టు ఎదుట హాజరుపర్చగా 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి తీసుకొని అధికారులు చంచల్గూడ జైలుకు తరలించారు.