కందుకూరు, జూన్ 5 : రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్ను సరఫరా చేస్తూ సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేసి రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. స్వరాష్ట్రంలో మెరుగైన విద్యుత్ అందిస్తున్నారని పేర్కొన్నారు. శబాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని సామ నర్సింహా రెడ్డి ఫంక్షన్ హాలులో నియోజకవర్గ విద్యుత్ ప్రగతి సభలో పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి పాలనలో కరెంట్ కష్టాలు ఉండేవని… కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారని తెలిపారు. అధికారంలోకి రావడానికి అమలు కానీ హామీలను ప్రతిపక్షాలు గుప్పిస్తున్నాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.
వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరిగినప్పటికీ సరఫరాలో ఏ మాత్రం అంతరాయం లేకుండా అన్ని విధాలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో అలుముకున్న చిమ్మ చీకట్లను స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తరిమేసి వెలుగులు నింపారని పేర్కొన్నారు. అంతకుముందు మంత్రి సహాఫంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జంగారెడ్డి, మార్కెట్ చైర్మన్ సురేందర్రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జయేందర్ ముదిరాజ్, సర్పంచులు రామక్రిష్ణారెడ్డి, గోపాల్రెడ్డి, సదాలక్ష్మీ పుల్లారెడ్డి. నరేందర్గౌడ్, కళమ్మ రాజు, బాలమని అశోక్, జిల్లా, మండల బీఆర్ఎస్ నాయకులు, సీజీఎం ఆనంద్, ఎస్ఈ లక్ష్మణ్, డీఈ రాజారాంరెడ్డి, డీఈ సురేశ్ కుమార్, ఏడీఈ రాజేందర్, రమేశ్ గౌడ్, ప్రభాకర్రెడ్డి,నాగిరెడ్డి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.