రామంతాపూర్, మార్చి 10: ఉప్పల్ జీహెచ్ఎంసీ పరిధి వెంకట్రెడ్డినగర్ డివిజన్ రామంతాపూర్ రామ్రెడ్డినగర్ కాలనీ-4లో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు కొనసాగుతున్నాయి. సోమవారం రామ్రెడ్డినగర్ కాలనీ -4లోని ఇంటి యజమాని రాములు తనకు ఉన్న 80 గజాల స్థలంలో జీ+2, ఆపైన పెంట్హౌజ్ నిర్మాణం చేపట్టాడు. దీంతో నిర్మాణ సమయంలో కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో పకన ఉన్న సిమెంట్ రేకుల ఇంటిపైన ప్రమాదవశాతు ఇటుకల గోడ కూలింది. ఈ ప్రమాదంలో రేకుల ఇంటి యజమాని రమేశ్, సరస్వతి దంపతుల కుమార్తె విన్య(6) అనే చిన్నారిపై తలపై ఇటుకలు పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఓ పైవేటు దవాఖనకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై ఉప్పల్ జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డీసీ, ఏసీపీ
రామంతాపూర్ రామ్రెడ్డినగర్ కాలనీ-4లో నిర్మాణదశలోని గోడ కూలి చిన్నారికి తీవ్రగాయాలైన విషయం తెలుసుకున్న ఉప్పల్ మున్సిపల్ డీసీ రాజు, ఉప్పల్ జోనల్ సిటీ ప్లానర్ కృష్ణమోహన్, ఏసీపీ నాగిరెడ్డి, టీపీఓ రాజేందర్ తన సిబ్బందితో కలిసి ప్రమాదం జరిగిన ఇంటిని పరిశీలించారు. అసలు ఆ ఇంటి నిర్మాణ అనుమతులు ఏంటి, ఎలా నిర్మిస్తున్నారు, నిర్మాణ దశలో చేపట్టిన జాగ్రత్తలు ఇంటి యజమానిని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇంటి యజమానిపై అధికారులు సీరియస్ అయ్యారు. వెంటనే ఆ ఇంటి అనుమతులు లేని పై కప్పును తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో రామ్రెడ్డినగర్ టౌన్ప్లానింగ్ అధికారులు పైకప్పును తొలగించే పనులు చేపట్టారు. ఈ విషయమై ఉప్పల్ పోలీసులను ఆరా తీయగా.. తల్లి ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.