డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
పది లక్షల విలువైన సొత్తు స్వాధీనం
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 30: ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎస్వోటీ, మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి పది లక్షల విలువైన 70 గ్రాముల డ్రగ్స్, కారు, వెయింగ్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ శిల్పవల్లి వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా, బిచుకొండ మండలం, పెద్దదేవడ గ్రామానికి చెందిన దేవేందర్ (40) విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డాడు. డ్రగ్స్ విక్రయించడం ప్రారంభించాడు.
రాజస్థాన్కు చెందిన ప్రదీప్ శర్మ, నరేశ్ చౌదరిల నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ను గ్రాము వెయ్యి రూపాయల లకు కొని.. నగరంలోని ఐటీ కారిడార్లో రూ. 7వేలకు విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం ఉదయం మాదాపూర్లో దేవేందర్ను పోలీసులు పట్టుకొని రిమాండ్కు తరలించారు.