సంగారెడ్డి: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ నేతృత్వంలో ఇవాళ సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరులో IJU 10వ ప్లీనరీ, TUWJ రెండో మహాసభ సమావేశాలు జరుగుతున్నాయి. పటాన్చెరులోని GMR కన్వెన్షన్ సెంటర్లో ఇవాళ ఉదయం ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
ఇవాళ్టి నుంచి మూడో రోజులపాటు అంటే 8, 9, 10వ తేదీల్లో సమావేశాలు కొనసాగనున్నాయి. సమావేశాల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MLC కవిత హాజరయ్యారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.