సుల్తాన్బజార్, ఏప్రిల్ 25 : సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఒక్కటైతే టెక్నాలజీలో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటాయని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి పేర్కొన్నారు. మంగళవారం మాసబ్ట్యాంక్లోని సైఫాబాద్ సైన్స్ కళాశాలలో ఉస్మానియా తష్క్ 2023 అండ్ ఓపెన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్నోవేషన్ అండ్ ఐప్లెడ్ ఆస్పెక్ట్స్ అండ్ సైన్స్ టెక్నాలజీ అనే అంశంపై ఒక్క రోజు జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ లింబాద్రి హాజరై ప్రసంగించారు. తష్క్ అండ్ ఓపెన్ డే వేడుకల్లో ఇటువంటి సదస్సులను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఐఐసీటీ హైదరాబాద్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీహరి మట్లాడుతూ కెమిస్ట్రీ ప్రాముఖ్యతపై విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు.
ఎన్జీఆర్ఐ హైదరాబాద్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ ఈవీఎస్ ఎస్కే బాబు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోలేకపోతే భవిష్యత్తు తరాలకు ఏమీ ఇవ్వలేమని అన్నారు. బీఎంఎంఆర్సీ జెనెటిక్ విభాగం హెచ్వోడీ ఖౌర్ జమీల్ మాట్లాడుతూ వాతావరణ కాలుష్యంతో జన్యుపరమైన మార్పులు వస్తున్నాయని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జె.లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ ఇన్నోవేషన్ అండ్ సైన్స్ టెక్నాలజీ లేకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ లక్ష్మీభవాని, హాస్టల్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జగదీశ్వర్, ఏఆర్ బాలకృష్ణ, అన్ని విభాగాల హెడ్స్, కోఆర్డినేటర్స్, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, ప్లేస్మెంట్, ప్రోగ్రామ్ ఆఫీసర్లు, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.