బండ్లగూడ, మార్చి 11: కేసీఆర్ హయంలో హైదరాబాద్లో లక్ష డబుల్బెడ్రూం ఇండ్లను నిర్మిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇండ్లను కూల్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. రాజేంద్రనగర్లోని హనుమాన్నగర్లో ఏండ్లుగా నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నవారిని ఇటీవల ప్రభుత్వ అధికారులు సంబంధిత స్థలం ప్రభుత్వానిది అని ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
ఈ క్రమంలో బాధితులు ఎమ్మెల్యే సబితారెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లగా ఆమె బుధవారం హనుమాన్నగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో మూడున్నర లక్షల డబుల్బెడ్రూంల ఇండ్ల నిర్మాణం చేస్తే.. రేవంత్రెడ్డి ఐదేళ్లలో లక్ష ఇండ్లను కూల్చడమే టార్గెట్గా పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన భూములను లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందన్నారు. వస్తుంది. హనుమాన్ నగర్ వాసులు భయపడవద్దని.. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువనేత కార్తీక్రెడ్డి, మాజీ కార్పొరేటర్ అర్చన జయప్రకాశ్, నాయకులు.. సుభాష్రెడ్డి, నరేందర్, రఘు యాదవ్, సూర్యం, కుమార్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.