హైదరాబాద్: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖైరతాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు దానం నాగేందర్ (Danam Nagender) ఖండించారు. బీఆర్ఎస్ పార్టీని వీడటం లేదని చెప్పారు. పార్టీ మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో పోటీచేయడం లేదని, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిని కాదని స్పష్టం చేశారు. ఏదైనా నేతలు, కార్యకర్తలతో చర్చించిన తర్వాతే రాజకీయ నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ అయ్యారు. ఆయన పార్టీ మారడానికి అంగీకరించారని, సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు అంగీకరించారని వార్తలు వచ్చాయి. ఈ నెల 18న కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే పార్టీ మార్పు వార్తలను ఆయన ఖండించారు.