హైదరాబాద్ : నాంపల్లి నుమాయిష్ ముగింపు దశకు చేరుకున్నది. ఏప్రిల్ 8వ తేదీ వరకు కొనసాగించనున్నట్లు నుమాయిష్ నిర్వాహకులు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా నుమాయిష్ నిర్వహణకు సహకరించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు, హైదరాబాద్ పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జనవరిలో ప్రారంభమైన నుమాయిష్.. కరోనా కారణంగా కొన్ని రోజులు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఫిబ్రవరి 25 నుంచి నుమాయిష్ను తిరిగి ప్రారంభించారు.