హైదరాబాద్ : ఆన్లైన్ లోన్ యాప్ల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. వారి ఆగడాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక హైదరాబాద్కు చెందిన మరో యువకుడు బలయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే జియగూడలోని న్యూ గంగా నగర్కు చెందిన రాజ్కుమార్(22) ఆన్లైన్ లోన్ యాప్ ద్వారా రూ. 12 వేలు రుణం తీసుకున్నాడు. అయితే లోన్ రిఫరెన్స్ కింద రాజ్కుమార్ తన స్నేహితుల మొబైల్ నంబర్లు ఇచ్చాడు. తీసుకున్న రూ. 12 వేల రుణంలో ఇప్పటికే రూ. 4 వేలు చెల్లించాడు.
మిగతా బాకీ చెల్లించలేదంటూ లోన్ రిఫరెన్స్ కింద ఇచ్చిన ఫ్రెండ్స్ నంబర్లకు నిర్వాహకులు మేసేజ్లు పంపించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాజ్కుమార్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కుల్సుంపురా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.