Hyderabad | హైదరాబాద్లో విషాదం నెలకొంది. దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.
తమ కూతురు రోజా రమణి (26) కనిపించడం లేదని నాగోల్కు చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే దుర్గంచెరువులో దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో ఆత్మహత్యకు పాల్పడిన యువతి రోజా రమణిగా నిర్ధారించారు.
కాగా, ఆత్మహత్యకు పాల్పడిన యువతి మెడికవర్ ఆస్పత్రిలో అకౌంటెంట్గా పనిచేస్తుంది. కొంతకాలంగా బ్యాంక్ లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు తాళలేకనే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు.