Hyderabad | హైదరాబాద్ : ఓ మహిళ తన కుమారుడిని చంపి, అనంతరం ఆమె ఉరేసుకుంది. ఈ విషాద ఘటన హైదరాబాద్ నగరంలోని ఫిలింనగర్లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. శిరీష(22) అనే మహిళకు నాలుగేండ్ల క్రితం విశ్వనాథ్ అనే వ్యక్తితో వివాహమైంది. ఈ దంపతులకు మూడేండ్ల వయసున్న కుమారుడు మనీష్ ఉన్నాడు. అయితే శుక్రవారం రాత్రి శిరీష తన కుమారుడికి ఇంట్లోనే ఉరేసింది. అదే ఇంట్లో శిరీష ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికీ తరలించారు.
అయితే భర్త, అత్తామామల వేధింపుల వల్లే శిరీష ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.