Hyderabad | హైదరాబాద్ : గత వారం రోజుల నుంచి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. దీంతో నగరమంతా చల్లని వాతావరణం ఏర్పడింది. కానీ రాబోయే రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం పలు ప్రాంతాల్లో ఉక్కపోత సంభవించింది.
రాబోయే రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్కు చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో కాస్త ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంది. కనిష్టంగా 22 నుంచి 23 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
శనివారం నగరంలో పలు ప్రాంతాల్లో వాన కురిసింది. ఉప్పల్లోని రాజీవ్ నగర్ కమ్యూనిటీ హాల్ పరిసరాల్లో 4.3 మి.మీ., మౌలాలిలో 3 మి.మీ., జీడిమెట్లలో 2.3 మి.మీ. వర్షపాతం నమోదైంది.