చంపాపేట, సెప్టెంబర్ 08 : దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందేందుకు ఫిజియోథెరపి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అవేర్ గెనీగల్స్ గ్లోబల్ ఆస్పిటల్ సీఈఓ డాక్టర్ సత్వీందర్ సింగ్ సభర్వాల్ అన్నారు. బుదవారం ప్రపంచ ఫిజియోధెరపి దినోత్సవం సందర్బంగా లింగోజి గూడ డివిజన్ పరిధి బైరమాల్ గూడలోని అవేర్ గెనీగల్స్ గ్లోబల్ హాస్పిటల్లో ఫిజియోథెరపి దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా హాస్పిటల్ లోని పలు విభాగాల వైద్య నిపుణులను డాక్టర్ సత్వీందర్ సింగ్, చీఫ్ ఫిజియోథెరఫిస్ట్ డాక్టర్ ఎం శ్రీనివాస రావు శాలువలతో సన్మానించి కేక్కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్లు విద్యాసాగర్, సురేష్ రెడ్డి, సుధీర్ ప్రసాద్, మురళీశ్వర్ రావు, భీమ్, సత్యనారాయణ, మోహన్, ప్రమీల, పూజ తదితరులు పాల్గొన్నారు.