కాచిగూడ,ఆగస్టు 19 : అనురాగ బంధానికి చిహ్నం, అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధం మరింతగా బలోపేతం అయ్యేందుకు రానున్న రాఖీ పండుగ ఎంతగానో దోహదపడుతుందని డీవీఎం కాచిగూడ అపర్ణ కల్యాణి అన్నారు. కరోనా సమయంలో ఇబ్బందులు తలేత్తకుండా అన్నా చెల్లెళ్ల సౌకర్యార్థం..రక్త సంభందాన్ని పటిష్టపరిచేందుకు కాచిగూడ, బర్కత్పుర, తిల్సుఖ్నగర్, ముషీరాబాద్-1, ముషీరాబాద్-2 ఆర్టీసీ పార్సల్, కొరియర్, కార్గొసర్వీస్ల ద్వారా అమూల్యమైన రాఖీలను అతి తక్కువ ఖర్చుతో వేగంగా తెలంగాణలోని ఏ ప్రాంతానికైన చేరవేయడానికి టీఎస్ ఆర్టీసీ సంస్థ సౌకర్యాం కల్పిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఈ అవకాశాన్ని అన్నా చెల్లెళ్లు, ఇతరులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆసక్తి గల వారు వివరాల కోసం డీవీఎం కాచిగూడ-9959226087, కాచిగూడ డిపో మేనేజర్ శ్రీనివాస్రావు- 9959226130,బర్కత్పుర డిపో మేనేజర్ వెంకట్రెడ్డి 9000406069, ముషీరాబాద్-1డిపో- 9959226134, ముషీరాబాద్-2 డిపో-9959226418, దిల్సుఖ్నగర్ డిపో9959226137 నెంబర్లలో సంప్రదించవచ్చని ఆమె తెలిపారు.