200 మంది ఉద్యోగులకు ఫిషింగ్ మెయిల్స్
ఇద్దరు ఉద్యోగులు ఆ మెయిల్స్ తెరిచారు..!
బ్యాంకులో సైబర్ సెక్యూరిటీ లోపాలు
హ్యాకర్స్ చేతికి చిక్కిన పాస్వర్డ్.. యూజర్ ఐడీలు
హ్యాండ్లర్స్ అరెస్ట్, విదేశాల్లో కీలక సూత్రధారి
హ్యాకింగ్ తీరును వివరించిన నగర సీపీ
సిటీబ్యూరో, మార్చి 30 : ఏపీ మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్పై సైబర్దాడి చేసేందుకు సైబర్ నేరగాళ్లు మూడు నెలల ముందు నుంచే స్కెచ్ వేశారని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్(టీఎస్ క్యాబ్)ను గతేడాది జూలైలో హ్యాక్ చేసిన ముఠా.. మహేశ్ బ్యాంక్పై గత నవంబర్ నుంచి దాడి మొదలు పెట్టిందని స్పష్టం చేశారు. ఈ కేసు వివరాలను బుధవారం సీపీ మీడియాకు వెల్లడించారు. హ్యాకింగ్ ఎలా చేశారనే విషయాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
హ్యాకింగ్ ఇలా చేశారు..
నిబంధనలు పాటించాల్సిందే..
బ్యాంకులు ఆర్బీఐ ఇచ్చిన సైబర్ సెక్యూరిటీ నిబంధనలు పాటించాలని సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ఉద్యోగులకు ఫిషింగ్ మెయిల్స్పై అవగాహన కల్పించాలని, యాంటీ వైరస్ సిస్టమ్ ఉండాలని సూచించారు. నిబంధనలన్నీ తప్పనిసరిగా పాటించే విధంగా బ్యాంకు యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తామన్నారు.