ఖైరతాబాద్, సెప్టెంబర్ 11 : రవీంద్రభారతి ప్రధాన రహదారిపై పోలీసులకు హ్యాండ్ బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగులో లభించిన సమాచారంతో బాధితురాలిని గుర్తించి, ఆమెకు. తిరిగి అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం.. రవీంద్రభారతి సిగ్నల్ వద్ద రోడ్డుపై ఓ మహిళ హ్యాండ్ బ్యాగ్ పడి ఉంది. ఆ బ్యాగును ఓ ఆటోడ్రైవర్ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఎదురుగా ఉన్న డీజీపీ కార్యాలయం వద్ద ఇంటర్సెప్టర్ వాహనంలో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్లు శ్యామ్ కుమార్, సాగర్, హోంగార్డు నారాయణరావు, డ్రైవర్ గోవర్ధన్ గమనించారు.
వెంటనే ఆటో డ్రైవర్ ప్రయత్నాన్ని అడ్డుకొని బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. సైఫాబాద్ పోలీసు స్టేషన్లో అప్పగించారు. అందులో 38 గ్రాముల బంగారు నగలు, రూ.10,050 నగదు, ఒక ఫోన్ ఉంది. బ్యాగులో లభించిన సమాచారంతో ఆ బ్యాగు కూకట్పల్లి నివాసి పద్మ కుమారిదిగా గుర్తించారు. వెంటనే ఆమెను పోలీస్ స్టేషన్కు పిలిపించి బ్యాగును అప్పగించారు. బంగారు నగలు, నగదు, విలువైన ఫోన్ను జాగ్రత్తగా అప్పగించిన పోలీసు సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.