MLA Rajasingh | హైదరాబాద్ : గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 6వ తేదీన శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా.. ఎమ్మెల్యే రాజాసింగ్ డీజే వినియోగించినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యే రాజాసింగ్తో పాటు మరో ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు మంగళ్హాట్ పోలీసులు పేర్కొన్నారు.
డీజే సౌండ్స్ పరిమితికి మించి హై వాల్యూంలో పెట్టారని పోలీసులు తెలిపారు. ఇందుకోసం కనీసం పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని పేర్కొన్నారు. ఇక శోభాయాత్ర సందర్భంగా పోలీసులను ఎమ్మెల్యేతో పాటు పలువురు నాయకులు అసభ్య పదజాలంతో దూషించారని గుర్తు చేశారు. ఎఫ్ఐఆర్లో రాజాసింగ్తో పాటు మాజీ మంత్రి ఆనంద్ సింగ్, ఎంపీ అభ్యర్థి భగవంత్ రావు పేర్లు నమోదు అయ్యాయి. నిర్వాహకులు ధ్వని నిబంధనలను పాటించడంలో విఫలమయ్యారని, దీనివల్ల ప్రజలకు అంతరాయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.