సిటీబ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): తక్షణమే స్పందించి నిందితులను పట్టుకోవడం, శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు తీసుకుంటూ ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అభినందించారు. వారికి నగదు పురస్కారాలను అందజేశారు.
ఇన్స్పెక్టర్ రాజు నాయక్, సత్తయ్య, ఎస్సైలు సురేశ్ రెడ్డి, నిరంజన్రెడ్డి, కానిస్టేబుల్ వేణుయాదవ్, నాంపల్లి ఇన్స్పెక్టర్ ఖలీల్ పాషా, బేగంపేట పీఎస్ ఎస్సై అనూష తదితరులు సీపీ అభినందించారు.