Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్లో వ్యభిచార ముఠా గుట్టురట్టు అయింది. ఇతర ప్రాంతాల నుంచి యువతులను హైదరాబాద్కు తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
నగరంలోని ఎస్సార్ నగర్, జూబ్లీహిల్స్ ఏరియాల్లో వ్యభిచార దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో బుధవారం రాత్రి ఓ హోటల్లో తనిఖీలు నిర్వహించి, వ్యభిచార ముఠాను అరెస్టు చేశారు. ఆరుగురు మహిళలను రెస్క్యూ హోంకు తరలించారు. అరెస్టు అయిన వారిలో సూర్య కుమారి అలియాస్ రాణి(38), కే విజయ శేఖర్ రెడ్డి(49), అర్కోకిట్ ముఖర్జీ(30) ఉన్నారు. మరో ఇద్దరు తప్పించుకున్నారు.
రాణి శేఖర్ రెడ్డి, ముఖర్జీతో కలిసి వెస్ట్ బెంగాల్, త్రిపుర, ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ యువతులకు ఎస్సార్ నగర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఆశ్రయం కల్పించారు. క్లయింట్ల కోరిక మేరకు ఆ యువతులను హోటల్స్కు, ప్రయివేటు ఫామ్ హౌజ్లకు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ముఠా సభ్యుల నుంచి రూ. 89,500 నగదు, రెండు కార్లు, ఐ ఫోన్లు, మొబైల్ ఫోన్స్, సిమ్ కార్డులు, ఆధార్ కార్డులు, బ్యాంక్ పాస్బుక్స్తో పాటు డెబిట్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.