సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) :పార్కు చేసిన వాహనాలను చోరీ చేస్తున్న ముగ్గురు నేరగాళ్లను బాలానగర్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీపీ శశాంక్రెడ్డి కథనం ప్రకారం.. జగద్గిరిగుట్ట, ఇందిరమ్మకాలనీకి చెందిన షేక్ ఇక్బాల్, షిర్డీహిల్స్కు చెందిన వడ్ల రవికుమార్, ఎల్బీనగర్, మన్సూరాబాద్కు చెందిన బెల్లంకొండ శివనాగమల్లేశ్వరరావు ముఠాగా ఏర్పడ్డారు. ఈ ముఠాలోని రవికుమార్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో పోక్సో కేసులో అరెస్టయ్యాడు.
కాగా ఈ ముగ్గురు నేరగాళ్లు పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను, ఆటోలను చోరీ చేస్తున్నారు. మేడ్చల్ పోలీసుల సహకారంతో బాలానగర్ సీసీఎస్ పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి ఆరు బైక్లు, మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మేడ్చల్, కేపీహెచ్బీ, జగద్గిరిగుట్ట, అల్వాల్, మీర్పేట్, బాలానగర్, బేగంపేట్, సంగారెడ్డి, చందానగర్, గుమ్మడిదల, కోదాడ పోలీస్స్టేషన్ల పరిధిలో నేరాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని ఏసీపీ వెల్లడించారు.