Hyderabad | నగర పరిధిలోని మాదాపూర్ నారాయణ కాలేజీలోని మహిళా క్యాంపస్లో అసిస్టెంట్ వార్డెన్గా పని చేస్తున్న భవానీ (21) అనే మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. శుక్రవారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే, ఆత్మహత్యపై కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు. ఉదయం ఘటన జరిగితే.. మధ్యాహ్నం వరకు కుటుంబ సభ్యులకు కాలేజీ యాజమాన్యం సమాచారం ఇవ్వలేదని మృతురాలి కుటుంబీకులు ఆరోపించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం సంఘటనా స్థలాన్ని పరిశీలించాయి. మృతురాలు స్వస్థలం యాద్రాద్రి జిల్లా పోచంపల్లి గ్రామం. మదాపూర్ నారాయణ కళాశాల సరస్వతీ క్యాంపస్లో అసిస్టెంట్ వార్డెన్గా భవానీ నెల రోజుల కిందట జాయిన్ అయ్యింది. ఇంతలోనే భవానీ ఆత్మహత్యకు పాల్పడడం కలకలం సృష్టిస్తున్నది. అయితే, ఆత్మహత్యకు మాత్రం కారణాలు తెలియరాలేదు. పోలీసులు ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.