Smart Parking | సిటీబ్యూరో, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): నాంపల్లిలో ఆటోమేటెడ్ మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాంపల్లిలో సుమారు ఆరు ఎకరాల స్థలంలో 15 అంతస్తుల భవన నిర్మాణాన్ని పీపీపీ విధానంలో రూ. 60 కోట్లతో చేపట్టింది. మెట్రో రైల్ ఆధ్వర్యంలో ఈ పనులు చివరి దశకు చేరుకున్నాయని, త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు తెలిపారు.