Hyderabad | హైదరాబాద్ : బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ఎన్ఆర్ఐ కాలనీలో ఓ కొండ చిలువ కలకలం సృష్టించింది. ఓ అపార్ట్మెంట్ సెల్లార్లో కొండచిలువను గుర్తించిన స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
అపార్ట్మెంట్వాసులు తక్షణమే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ సిబ్బందికి సమాచారం అందించడంతో.. ఆ అపార్ట్మెంట్ వద్దకు వారు చేరుకున్నారు. ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ వాలంటరీ.. చాకచక్యంగా కొండచిలువను పట్టేశారు.
ఎన్ఆర్ఐ కాలనీలోకి సమీపంలో ఉన్న చెరువులో నుంచి కొండచిలువ అపార్ట్మెంట్ సెల్లార్లోకి వచ్చి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ నగర వ్యాప్తంగా వానలు దంచికొట్టిన సంగతి తెలిసిందే.