GHMC | సిటీబ్యూరో, మార్చి 17(నమస్తే తెలంగాణ): ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లో ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
కాగా, ద్రోణి ప్రభావంతో చల్లబడిన నగరంలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 33.6 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 23.7 డిగ్రీలు, గాలిలో తేమ 46 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.