సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోయాయి. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 33.8, కనిష్ఠం 26.2, గాలిలో తేమ 50శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ద్రోణి ప్రభావం కొనసాగుతుండడంతో రాగల 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై, నగరంలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.