సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
శుక్రవారం సాయంత్రం గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి జల్లులు కురవగా, పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. గరిష్ఠం 34.4, కనిష్ఠం 23.9 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 46 శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.