సిటీబ్యూరో, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఇటీవల కురిసిన వర్షాలతో కాస్త చల్లబడిన నగరం.. మళ్లీ వేడెక్కోతోంది. నగరంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో ఉక్కపోత అధికమవుతున్నది. కూలర్లు, ఏసీలు ఆన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.
బుధవారం నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34.0డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24.0, గాలిలో తేమ 70 శాతంగా నమోదైందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.