మల్కాజిగిరి, మార్చి 8: మహిళల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేయూతనిస్తుందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళ వారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్ల పరిధిలో జరిగిన సంబురాల్లో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, అధికారులు, కార్పొరేటర్లు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు. దళిత మహిళలు ఆర్థికంగా ఎదగడానికి దళిత బంధులో రూ.10లక్షలతో స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం చేస్తున్నదని అన్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగు లకు నెలనెలా పింఛన్లు అందజేస్తున్నారని అన్నారు. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంలో రూ.1,00.116ల ఆర్థిక సహాయం చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ డీసీ నాగమణి, ఏసీపీ విజయశ్రీ, పీఓ రజినీ, కార్పొరేటర్లు సునీతాయాదవ్, ప్రేమ్కుమార్, శాంతిశ్రీనివాస్ రెడ్డి, సబితాకిశోర్, రాజ్ జితేంద్రనాథ్, మాజీ కార్పొరేటర్ జగదీశ్గౌడ్, హెచ్ఎం సంధ్యారాణి, ఎస్ఓఓ సుబ్బారావు, సీఆర్ఓ వెంకట్రావు, శ్రీసుధ, కృష్ణవేణి, అనిల్కిశోర్, పరుశరాంరెడ్డి, గుండా నిరంజన్, జీఎన్వీ సతీశ్కుమార్, శ్రీనివాస్, రాముయాదవ్, విజయకుమారి, సంధ్య, జయశ్రీ, వసంత, భాగ్యవతి తదితరులు పాల్గొన్నారు.