కొండాపూర్, మార్చి 8 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా మహిళల సంక్షేమం, సంరక్షణ, అభివృద్ధిల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మంగళవారం అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అనంతరం జోనల్ కమిషనర్ ప్రియాంక ఆలా, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, టీమ్స్ డైరెక్టర్ విమల థామస్, కార్పొరేటర్లు జగదీశ్వర్గౌడ్, శ్రీనివాసరావు, శ్రీకాంత్, పూజిత జగదీశ్వర్గౌడ్, మంజుల రఘునాథరెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయిబాబా, బాలివుడ్ నటీ, మిస్ ఇండియా ఈప్సిత, కమిషనర్లు వెంకన్న, సుధాంషు, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ సురేష్లతో కలిసి మహిళా కండక్టర్లు, మహిళా ప్రధానోపాధ్యాయులు, సంఘ సేవకురాలను సన్మానించి కేక్ను కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితో పాటుగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని జంట సర్కిళ్లలో విధులు నిర్వహిస్తున్న శానిటేషన్, మహిళ సిబ్బందిని ఘనంగా సన్మానించారు. అనంతరం నియోజకవర్గ మహిళలకు ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులతో పాటు జంట సర్కిళ్ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో..
అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని గచ్చిబౌలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్ర, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మెర్సీ మార్గరేట్ కేంద్ర సాహిత్య అవార్డ్ గ్రహీత రాజేంద్ర నిమ్మే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
శిల్పకళా వేదికలో..
లీడ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళ దినోత్సవంలో విప్ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మహిళా సాధికారతకు కృషి..
మహిళా సంక్షేమం సీఎం కేసీఆర్ చూపుతున్న శ్రద్ధ, అమలు చేస్తున్న పథకాలు గొప్పవని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ తరహా పథకాలు లేవని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని తెలిపారు. మహిళా బంధు కార్యక్రమంలో భాగంగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని గోదాకృష్ణ ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన మహిళలను సన్మానించారు. స్వయం సహాయక సంఘాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద రూ. 6.50 కోట్ల చెక్కులను కార్పొరేటర్లు వెంకటేశ్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, మాధవరం రోజాదేవి లతో కలిసి విప్ గాంధీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. మహిళలకు తగు ప్రాధాన్యతనిస్తున్న తెలంగాణ ప్రభుత్వం వారికి గౌరవంగా మహిళా బంధు కార్యక్రమాలను నిర్వహించటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, పార్టీ సీనియర్ నాయకులు, మహిళా ప్రతినిధులు, అనుబంధ సంఘాల మహిళలు, ఆర్పీలు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
మెడికవర్లో మహిళాదినోత్సం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం మాదాపూర్లోని హెచ్ఐసీసీలో మెడికవర్ హాస్పిటల్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ లో పాట్గానానన్నవేడులకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షీ టీం ఇన్చార్జి, డీపీనీ అనసూయ విచ్చేసి మెడికవర్ దవాఖాన చైర్మన్ అనీల్ కృష్ణ, క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ శరత్ రెడ్డి, మెడికవర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణలు హాజరై వైద్య సిబ్బందితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా షీ టీం ఇన్చార్జి, డీసీపీ అనసూయ మాట్లాడుతూ.. మహిళలు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలలో రాణిస్తున్నందున వారి విజయాలకు గుర్తింపుగా అంకితం చేస్తూ మహిళా దినోత్సవంను జరుపుకోవడంపై హర్ష వ్యక్తం చేశారు.