కవాడిగూడ, జనవరి 3: ఒమిక్రాన్ కట్టడికీ రాష్ట్ర ప్రభు త్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నదని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం ముషీరాబాద్, భోలక్పూర్, దోమలగూడ యూపీహెచ్సీ కేంద్రాలలో 15 నుంచి 18 ఏండ్ల లోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్ను ఆయన వైద్యాధికారులు డాక్టర్ కృష్ణమోహన్ రావు, డాక్టర్ రాజ్యలక్ష్మీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడూతూ.. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పిల్లలు తప్పనిసరిగా వ్యాక్సిన్ను వే యించుకోవాలని అన్నారు. జలుబు, తలనొప్పి, జ్వరం ఉన్నైట్లెతే వెంటనే సంబంధిత యూపీహెచ్సీలలో పరీక్షలు చేయించుకొని మందులు వాడాలని అన్నారు. సం బంధిత యూపీహెచ్సీల వైద్యాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర నాయకుడు ముఠా జయసింహ, కవాడిగూడ, భోలక్పూర్, గాంధీనగర్ డివిజన్ల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వల్లాల శ్యామ్యాదవ్, శ్రీనివాస్, రాకేశ్కుమార్, కవాడిగూడ డివిజన్ ప్రధాన కార్యదర్శి సాయికృష్ణ, భోలక్పూర్ మాజీ అధ్యక్షుడు మహ్మద్అలీ, నాయకులు మున్వర్చాంద్, ఆర్. శ్రీనివాస్, జునేద్ బాగ్ధాది, దీన్దయాళ్రెడ్డి, వల్లాల శ్రీనివాస్యాదవ్, కల్వ గోపీ, రాంచందర్, జే రాజేశ్, రాజశేఖర్గౌడ్, శివముదిరాజ్, ముఠా శివసింహ, చాంద్పాష తదితరులు పాల్గొన్నారు.