ముషీరాబాద్, ఏప్రిల్ 23: ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ పిలుపునిచ్చారు. డివిజన్లలో భారీ ఏర్పాట్లు చేసి, జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా కోరారు. శనివారం ముషీరాబాద్, అడిక్మెట్ డివిజన్ల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశాలను మోహన్నగర్ కమ్యూనిటీహాల్, అడిక్మెట్ టీఆర్ఎస్ కార్యాలయాల్లో వేర్వేరుగా నిర్వహించి ఆవిర్భావ ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూడళ్లు, చౌరస్తాలో పార్టీ జెండా ఆవిష్కరణలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు డివిజన్లను గులాబీ తోరణాలతో ముస్తాబు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పాటులో టీఆర్ఎస్ పార్టీ పాత్రను, సీఎం కేసీఆర్ ఉద్యమ పోరాట పటిమను చాటిచెప్పే కార్యక్రమాలు చేపడతామన్నారు. సమావేశంలో యూత్ విభాగం నేత ముఠా జయసింహ, సినీయర్ నాయకుడు ఎడ్ల హరిబాబు యాదవ్, ముషీరాబాద్, అడిక్మెట్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాడబోయిన నర్సింగ్ప్రసాద్, శ్రీనివాస్రెడ్డి, సురేందర్, ముచ్చకుర్తి ప్రభాకర్, శ్రీధర్రెడ్డి, ఆకుల అరుణ్, మల్లికార్జున్రెడ్డి, బొట్టు శ్రీనివాస్, జెల్ల భిక్షపతి,, ప్రేమలతారెడ్డి, సుబ్బారావు పాల్గొన్నారు.
రాంనగర్ డివిజన్లో మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు రేశం మల్లేశ్, సిరిగిరి శ్యామ్, భిక్షపతి యాదవ్, కల్వ గోపి, నేత నివాస్, శ్రీశైలం యాదవ్, బాల్రాజ్ గౌడ్, కల్పన, సాలమ్మ పాల్గొన్నారు.
జవహర్నగర్ కమ్యూనిటీ హాల్లో..
పరిపాలనలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు రాకేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం జవహర్నగర్ కమ్యూనిటీ హాల్లో డివిజన్ విస్తృత స్థాయి సమావేశం నిర్వ హిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 27న టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వ హించనున్నట్లు తెలిపారు. ప్రతి బస్తీ గులాబీమయం కావాలని, పండుగ వాతావరణంలో తలపించేలా ఏర్పాట్లు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్ ముఠా పద్మానరేశ్, పార్టీ సీనియర్ నాయకుడు ముఠా నరేశ్, ఎర్రం శ్రీనివాస్ గుప్తా, గడ్డమీది శ్రీనివాస్, మారిశెట్టి నర్సింగ్ రావు,పాశం రవి, హన్మంతు తదితరులు పాల్గొన్నారు.
కవాడిగూడ డివిజన్లో..
టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. శనివారం డివిజన్లోని బండమైసమ్మనగర్ కమ్యూనిటీ హాల్లో సీనియర్ నాయకుడు వల్లాల శ్రీనివాస్ యాదవ్, భోలక్పూర్ డివిజన్లోని గంగపుత్ర సంఘంలో భోలక్పూర్ టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ల ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జయసింహ, వల్లాల శ్యామ్ యాదవ్, నవీన్ కుమార్, రవీందర్, గోపి, యాదగిరి, రాంచందర్, మాధవి, రాజశేఖర్ గౌడ్, శ్రీశైలం, సురేందర్ గౌడ్ పాల్గొన్నారు.