శామీర్పేట, ఏప్రిల్ 1: ఆర్థిక పరిపుష్టి సాధించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆ దిశగా అన్ని వర్గాల ప్రజలను తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ, అభివృద్ధి పథకాలను రూపొందించి ప్రవేశ పెడుతున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఎస్ఆర్డీపీ పథకంలో భాగంగా శామీర్పేట, మూడు చింతలపల్లి మండలాల్లో పర్యటించి శుక్రవారం గొర్రెల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బంగారు తెలంగాణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల అభ్యున్నతికి పాటు పడుతున్నారని అన్నారు. కుల వృత్తుల వారు ఆర్థిక పరిపుష్టి సాధించినప్పుడే అభివృద్ధి వైపు తెలంగాణ రాష్ట్రం బాటలు వేస్తున్నట్టని తెలిపారు. అందులో భాగంగానే దేశ చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో సంక్షే మ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఆర్థిక అసమానతలను రూపుమాపడమే లక్ష్యంగా గొర్రెలు, చేపల పంపిణీ, రైతాంగానికి, చాకలి, మంగలి కుల వృత్తుదారులకు ఉచిత విద్యుత్ పంపిణీ, ఇలా చెప్పుకుంటే పోతే ప్రతి కుల సంఘానికి ప్రత్యేక పథకాలను అందించినట్టు తెలిపారు. ఎక్కడి నుంచో మాంసం దిగుమతి చేసుకోవడం కాదు.. తెలంగాణలోనే గొర్రెలు, మేకల పెంపకంతో గొల్ల కురుమలు ఆర్థికంగా ఎదుగుతారని నమ్మి ముఖ్యమంత్రి గొర్రెలను పంపిణీ చేస్తున్నారని తెలిపారు.
అనంతరం, రాష్ట్ర షీప్, గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు యాద వ్ మాట్లాడుతూ, కేసీఆర్ దేశం మెచ్చిన నేత అని, ప్రజా సమస్యలను గుర్తిం చి అడిగిందే తడవుగా అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలుసని అన్నారు. జరుగుతున్న అభివృద్ధిపై ఇష్టానుసారంగా మాట్లాడే వాడు నాయకుడు కాదని అన్నారు. అభివృద్ధిపై అక్కసుతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న వారికి వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ జహంగీర్, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశం, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, ఎంపీపీలు ఎల్లూభాయిబాబు, హారిక మురళీ గౌడ్, జడ్పీటీసీ అనితా లాలయ్య, వైస్ ఎంపీపీ సుజాత, రైతు బంధు అధ్యక్షుడు కంటం కృష్ణారెడ్డి, శ్యామల, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు జహంగీర్, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, డైరెక్టర్ హనుమాన్ దాస్, సర్పంచ్లు కుమార్ యాదవ్, సుజాత, మోహన్రెడ్డి, అనూరాధ, జామ్ రవి, విష్ణువర్ధన్రెడ్డి, ఆంజనేయులు, ఎంపీటీసీలు ఇందిరా రాజిరెడ్డి, సుగుణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అనిల్రెడ్డి, మాజీ ప్ర.కా. తాళ్ళ జగదీశ్ గౌడ్, యూత్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, గొల్ల కురుమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
35 యూనిట్ల పంపిణీ..
శామీర్పేట మండలంలోని అలియాబాద్ గ్రామానికి చెందిన గూడె శ్యామ్ కుమార్, మమిండ్ల రాజయ్య, మామిండ్ల రాజ మల్లయ్య, చెరుకుల శ్రీను, యాడారం గ్రామానికి చెందిన బండి వెంకటేశ్, ముఖ్యమంత్రి దత్తత మండలం మూడు చింతలపల్లిలోని ఉద్దెమర్రి గ్రామంలో లబ్ధిదారులకు పశువైద్య, పశు సంవర్ధక శాఖ గొర్రెల అభివృద్ధి పథకం (ఎస్ఆర్డీపీ)లో భాగంగా 35 యూనిట్ల గొర్రెలను మంత్రి మల్లారెడ్డి, బాలరాజు యాదవ్ పంపిణీ చేశారు.