మల్కాజిగిరి, మార్చి 12: ఆస్తిపన్ను వసూలు చేయడానికి అధికారులు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. మార్చి 31వరకు పన్ను చెల్లించడానికి అవకాశం ఇస్తున్నారు. అల్వాల్ సర్కిల్లో 2021-2022 ఆర్థిక సంవత్సరానికి రూ.27కోట్ల పన్నులు వసూలు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు రూ.22,10కోట్ల పన్నులు వసూలు కాగా… మిగిలిన రూ.4,90కోట్లు వసూలు చేయడానికి అధికారులు ఇండ్ల యజమానులను కలసి.. కట్టమని ఇప్పటికే డిమాండ్ నోటీసులు జారీచేశారు. అల్వాల్ సర్కిల్ పరిధిలో 156కాలనీలు, బస్తీలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 43,441 గృహాలు, అపార్టుమెంట్లతో పాటు వాణిజ్య భవనాలు ఉన్నాయి.
దాదాపు 3లక్షల మంది నివసిస్తున్నారు. ప్రస్తుతం మార్చి 31వరకు బకాయిలు ఉన్న రూ.4,90కోట్ల పన్నులు వసూలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన టార్గెట్ను చేరడానికి టాక్స్ ఇన్స్పె క్టర్లు, బిల్ కలెక్టర్లు, అసిస్టెంట్ బిల్ కలెక్టర్లు, ఏఎంసీ అధికారులు పన్నులు చెల్లించాలని ఇండ్ల యజమానులకు తెలుపుతున్నారు. మిగిలిన రూ.7,86కోట్ల పన్నులు వసూలు చేయడానికి అధికారు లు కృషి చేస్తున్నారు. కౌకూర్లోని వాటర్ ప్లాంట్ యజమాని రూ.8,23,057 పన్నును చెక్ ద్వారా చెల్లించాడు. అయితే చెక్ బౌన్స్ కావడంతో గతవారం సీజ్ చేశారు. రెండు రోజుల కిందట సీవీఆర్ గార్డెన్ రూ.13.70లక్షలు, మరో ఫంక్షన్ హాల్ రూ.12ల క్షల పన్నుల బకాయి, మెడిప్లెస్ భవన సముదా యం రూ.4.70 లక్షల బాకాయి పడిన ఆస్తులు, లోతుకుంటలోని శ్రీ లక్ష్మి కళామందిర్ సినిమా హాల్ రూ.7,79,690బకాయి పడినందున డీసీ నాగమణి సీజ్ చేశారు. గత ఏడాది పన్నులు ఎగనామం పెట్టిన వారికి రెడ్ నోటీసులు జారీ చేయనున్నారు.
ఆస్తి పన్ను చెల్లించాలి..
ఆస్తిపన్ను రూ.45,42,690లక్షల బకాయి ఉన్న ఆస్తులను సీజ్ చేశాం. ఇండ్ల యజమానులు ఆస్తిపన్ను చెల్లించడానికి ముం దుకు రావాలి. అల్వాల్ సర్కిల్ పరిధిలోని ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. ఆర్థిక సంవ త్సరం 2021-22కి టార్గెట్ రూ.27కోట్లకు గాను ఇప్పటి వరకు రూ.22,10కోట్లు వసూలు చేశాం. మిగిలిన రూ.4,90కోట్ల పన్ను లు వసూలు చేయడానికి అధికారులు కృషి చేస్తున్నారు.
– నాగమణి, డీసీ