సిటీబ్యూరో, డిసెంబర్ 20(నమస్తే తెలంగాణ) : నగరంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఉప్పల్ సరిల్ వార్డు నంబర్ 7 చిలుకానగర్లో రూ. 2 కోట్లతో చేపట్టిన వీడీసీసీ రోడ్లకు మేయర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నిరుపేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. చిలుకానగర్లో పైపులైన్ పనులు పూర్తవ్వడంతో సీసీ రోడ్డును వీడీసీసీగా పునరుద్ధరణ చేసి పటిష్టమైన రోడ్డు పనులను త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. అనంతరం లక్ష్మీనరసింహ స్వామి ఆలయం నుంచి వీరెల్లిగూడ, శ్రీరామ్నగర్ కాలనీల్లో దిశా బొటిక్ నుంచి గణేశనగర్ వరకు చేపట్టే వీడీసీసీ రోడ్డు పనులకు మేయర్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా శానిటేషన్, స్వచ్ఛ అటో డ్రైవర్ల పనితీరుపై కాలనీవాసులతో మేయర్ మాట్లాడారు. సివరేజీ పూడికతీత మట్టిని తీసిన తర్వాత వెంటనే తొలగించడం లేదని , అధికారులకు చెప్పినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని మహిళలు మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. బలెందర్ షాపు నుంచి విజ్ఞాన గ్రామర్ సూల్ వరకు రూ.65 లక్షలతో చేపట్టిన వీడీసీసీ రోడ్డుకు మేయర్ శంకుస్థాపన చేశారు. తదనంతరం మల్లికార్జున నగర్లో రూ.80 లక్షలతో చేపట్టిన అంతర్గత రోడ్డుకు, శ్రీరామ్నగర్లో రూ.55 లక్షలతో చేపట్టిన వీడీసీసీ రోడ్డుకు మేయర్, స్థానిక కార్పొరేటర్ బి.గీతా ప్రవీణ్, జోనల్ కమిషనర్ పంకజ, ఉప్పల్ సరిల్ డీసీ అరుణకుమారితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీ రామ్నగర్లోని అంగన్వాడీ కేంద్రాన్ని మేయర్ పరిశీలించారు. పిల్లలకు అందిస్తున్న పోషకాహారం వివరాలను అడిగి తెలుసుకున్నారు.