సిటీబ్యూరో, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): సామాజిక వర్గానికి గుర్తింపు రావాలంటే సంఘటిత శక్తిని ప్రదర్శించాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ అన్నారు. కొత్తపేటలోని బాబూ జగ్జీవన్ రామ్ భవన్లో ఆదివారం నిర్వహించిన అఖిల భారత చాత్తాద శ్రీ వైష్ణవ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా చాత్తాద శ్రీ వైష్ణవ పండితులను ఘనంగా సత్కరించారు. ప్రతిభ గల విద్యార్థులకు సాలర్ షిప్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ కిరణ్, అఖిల భారత చాత్తాద శ్రీ వైష్ణవ సమాఖ్య అధ్యక్షుడు తిరుకోళ్లురి రామానుజం, అఖిల భారత చాత్తాద శ్రీ వైష్ణవ సమాఖ్య కార్యదర్శి కర్పూరం రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.