చర్లపల్లి, డిసెంబర్ 18 : రాష్ట్రం నుంచి శబరిమలకు వెళ్లే స్వాములకు సౌకర్యాలు కల్పించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మె ల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఈసీనగర్ కమ్యూనిటీ హాల్లో ఆదివారం జరిగిన గురుస్వామి బొజ్జ నర్సింహ 18వ పడిపూజలో ఆయన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అయ్యప్ప దీక్షల నేపథ్యంలో శబరిమలకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందన్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో గురుస్వాములు రుద్రగోని వెంకటేశ్గౌడ్, కడియాల సురేశ్, తగరపు రాజు, నరేశ్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు గిరిబాబు, అనిల్కుమార్, నాయకులు సత్తిరెడ్డి, కడియాల బాబు, వేణుగోపాల్రెడ్డి, సత్తిరెడ్డి, హనుమంత్, వెంకట్స్వామి, గడ్డం రవికుమార్, గరిక సుధాకర్తో పాటు వందలాది మంది స్వాములు, తదితరులు పాల్గొన్నారు.