శామీర్పేట, డిసెంబర్ 16 : గ్రామాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్యా అన్నారు. మూడుచింతలపల్లి మండలంలోని మూడుచింతలపల్లి, అనంతారం గ్రామాల్లో శుక్రవారం పర్యటించి రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలను తప్పకుండా చేపట్టాలన్నారు. రికార్డుల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు ఉండరాదన్నారు. పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, డంపింగ్ యార్డు, వైకుంఠధామాల నిర్వహణ చేపట్టాలన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంతోపాటు గ్రామాల్లో పారిశుధ్యాన్ని పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవి, సర్పంచ్ నర్సింహారెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.