మేడ్చల్, డిసెంబర్ 9: మేడ్చల్, శామీర్పేటల్లో ఉన్న జాతీయ రహదారి, రాష్ట్ర రహదారుల్లో జరుగుతున్న ప్రమాదాలకు అడ్డుకట్టుకు విస్తృతంగా చర్యలు తీసుకుంటున్నారు. మేడ్చల్ ప్రాంతంలో రోజు రోజుకు ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేక దృష్టి సారించారు. కమిషనరేట్ పరిధిలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న మేడ్చల్లో పత్యేక ట్రాఫిక్ పోలీస్స్టేషన్ను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి, ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. నాలుగు నెలల కిందట అల్వాల్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ నుంచి మేడ్చల్, శామీర్పేటలను విభజించి, మేడ్చల్లో ట్రాఫిక్ పోలీస్స్టేషన్ను ఏర్పాటు చేశారు. సీఐ నర్సింహ రెడ్డితో పాటు ఇద్దరు ఎస్సైలు లింగం, విఠల్నాయక్, 34 మంది సిబ్బందిని నియమించారు. పరిధి తక్కువ కావ డం, సిబ్బంది ఎక్కువ కావడంతో విస్తృతంగా చర్యలు తీసుకునే అవకాశం లభించింది. అలాగే మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న మేడ్చల్ ప్రాంతంలో జాతీ య రహదారిపై వరుస ప్రమాదాల నేపథ్యంలో ట్రాఫిక్, మున్సిపాలిటీ, జాతీయ రహదారి, ఆర్అండ్బీ అధికారులు ఉమ్మడిగా అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో ప్రమాదాలకు కారణాలను గుర్తించి, చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు. సీఐ నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు.
బ్లాక్ స్పాట్స్ గుర్తింపు
మేడ్చల్లో ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధి కండ్లకోయ నుంచి ఎల్లంపేటలో ఉన్న సెవెన్ స్టార్ దాబా వరకు 12 కిలో మీటర్లు ఉంది. శామీర్పేట పరిధిలో హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ నుంచి అచ్చాయపల్లి యూటర్న్ వరకు 22 కిలో మీటర్లు ఉంది. శామీర్పేటలో పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ప్రత్యేక బ్లాక్ స్పాట్స్ను గుర్తించలేదు. రోడ్డు పొడవునా ప్రమాదాలు జరుగుతున్నాయి. మేడ్చల్లో మాత్రం ప్రమాదాలు ఎక్కువగా జరిగే 7 బ్లాక్ స్పాట్స్ను గుర్తించారు.
ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న చర్యలు
నిబంధనలు పాటించకపోవడమే సమస్య..
రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు విస్తృతంగా చర్యలు తీసుకుంటున్నాం. రంబుల్ స్ట్రిప్స్, బారికేడ్లు, సైన్ బోర్డులను ఏర్పాటు చేశాం. ప్రమాదానికి అస్కారం ఉన్న ఉన్నచోట బ్లికింగ్ లైట్లను ఏర్పాటు చేస్తున్నాం. మోటార్ వెహికిల్ డ్రైవింగ్ రెగ్యులేషన్స్(ఎంవీడీఆర్) 2017 జారీ చేసిన 40 నిబంధనలను అనుసరిస్తే రోడ్డు ప్రమాదాలను 95 శాతం తప్పించవచ్చు. ప్రతి రోజు మేడ్చ ల్, శామీర్పేట పరిధిలో మూడు చోట్ల డ్రంక్ అం డ్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. 10 మందిలో ముగ్గురు మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడుతున్నారు. ప్రజలు రోడ్డు నిబంధనలు పాటించకపోవడమే ప్రధా న సమస్య. నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు 5 శాతానికి పరిమితం చేయవచ్చు.
– నర్సింహా రెడ్డి, ట్రాఫిక్ సీఐ, మేడ్చల్