అమీర్పేట్, డిసెంబర్ 9: సంప్రదాయ పట్టు వస్ర్తాలకు నిలయమైన కాంచీపురం మంగళగౌరి సిల్క్స్ షాపింగ్ మాల్ శుక్రవారం అమీర్పేట్లో ప్రారంభమైంది. మిస్- ఇండియా- 2021 మానస వారణాసి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్వచ్ఛమైన పట్టు వస్ర్తాల అమ్మకాలకు పేరుగాంచిన కాంచీపురం మంగళగౌరి సిల్క్స్ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మంగళగౌరి సిల్క్స్ షాపింగ్ మాల్ డైరెక్టర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ టెక్స్టైల్ రిటైల్ రంగంలో కస్టమర్ల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మంగళగౌరి సిల్క్స్ తన అమ్మకాలను కొనసాగిస్తోందన్నారు. అమీర్పేట్లో ప్రారంభించిన తమ మాల్లో శుభకార్యాలకు అవసరమైన 4 లక్షలకు పైగా అద్భుతమైన కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మాల్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని వివాహాది శుభ కార్యాలకు సంబంధించిన వస్ర్తాల అమ్మకాలపై వీవర్స్ అసోసియేషన్ల ధరలకే అమ్మకాలు జరుపుతున్నామని, కస్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.