ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 9: దేశ అభివృద్ధిలో వ్యవసాయరంగం ఎంతో కీలకమని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి అన్నారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర భారతావనిలో వ్యవసాయరంగం అభివృద్ధిలో చెప్పుకోదగిన మార్పుల సంభవించాయని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎకానమిక్స్ విభాగంలో ‘భారత వ్యవసాయరంగ అవలోకనం – అవకాశాలు’అనే అంశంపై ఒక రోజు జాతీయ సదస్సును నిర్వహించారు. పీజీఆర్ఆర్సీడీఈ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన ఈ సదస్సు ప్రారంభోత్సవానికి యన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 75 ఏండ్లలో ధనికులు మరింత ధనికులయ్యారని, కానీ పేదవాళ్లు మాత్రం మరింత పేదవాళ్లుగా మిగిలిపోయారని చెప్పారు. రైతు బంధు, రైతు బీమా వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతులకు మేలుచేస్తున్నాయని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, మహారాష్ట్రలోని శివాజీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రకాశ్ ఎస్. కాంబ్లే, ఐసీఎస్ఎస్ఆర్-ఎస్ఆర్సీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఉషాకిరణ్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ గణేశ్, ఓయూ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ నరేందర్, ఓయూ ఎకానమిక్స్ విభాగం హెడ్, సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ నారాయణ, సికింద్రాబాద్ పీజీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుధాకర్రెడ్డి, ప్రొఫెసర్ డేసీ, కోఆర్డినేటర్ డాక్టర్ కొండల్ పాల్గొన్నారు.