శామీర్పేట, డిసెంబర్ 5: కార్మికుల జోలికి వస్తే సహించేది లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. శామీర్పేటలోని లియోనియా రిసార్ట్స్లో లియో మెరిడియన్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయా న్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు వెన్నుదన్నుగా సీపీఐ నిలబడుతుందన్నారు. లియోనియా కార్మికులకు మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ బ్యాంక్ల ఆధ్వర్యంలోనే కార్మికులకు న్యాయం చేయాలని, లియో నిర్వహణ కార్మికులకే అప్పగించాలని డిమాండ్ చేశారు. లియోనియాలో కార్మికులు దామోదర్రెడ్డి వల్ల ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ కార్మికసంఘం ప్రధాన కార్యదర్శి బాలమల్లేశ్, సీపీఐ జిల్లా కార్యదర్శి డీసీ.సాయిలుగౌడ్, సహాయ కార్యదర్శి ఉమ మహేశ్, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్ర, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, ఏఐటీయూటీ జిల్లా కార్యదర్శి శంకర్రావు, సమాఖ్య జిల్లా అధ్యక్షులు జయలక్ష్మీ, యువజన సమాఖ్య జిల్లా కార్యదర్శి సత్యప్రసాద్, ఏఐటీయూసి జిల్లా కార్యదర్శి జయచంద్ర, లియో మెరిడియర్ ఎంప్లాయీస్ యూనిషన్ అధ్యక్షుడు కే.రామకృష్ణరాజు, ప్రధాన కార్యదర్శి బి.కోమల, ఉపాధ్యక్షులు అజయ్కుమార్, సహాయ కార్యదర్శి బి.వెంకటరమణ పాల్గొన్నారు.