ఉప్పల్, డిసెంబర్ 5 : ఉప్పల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. సోమవారం ఉప్పల్లోని హనుమసాయినగర్లో రూ.84లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు పనుల ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీల్లో రోడ్ల సమస్యలు లేకుండా ని ధులు తీసుకువచ్చి..పనులు ప్రారంభిస్తున్నామని చెప్పా రు. సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం తగిన చేయూతనందిస్తుందన్నారు. గత ప్రభుత్వాలు చేయని ఎన్నో పనులు ఇప్పుడు చేపడుతున్నామని అన్నారు. ప్రజల ఆకాంక్షలను గుర్తించి, తగిన పరిష్కార చర్యలు చేపడుతున్నామని అన్నారు. డివిజన్ల వారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, అభివృద్ధి, సంక్షేమంలో స మన్వయంతో ముందుకుసాగుతున్నామని చెప్పారు. రాజకీయాలు చేయడం కంటే అభివృద్ధికి అధిక ప్రాధాన్య త ఇస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సూచనల మేరకు అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం ప్రజలతోనే ఉంటామన్నారు.
సమస్యల పరిష్కారానికి చర్యలు
ఉప్పల్లోని హనుమసాయినగర్కాలనీ, వెంకటేశ్వరకాలనీలలో అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, పరిష్కార చర్యలను సూచిస్తూ పాదయాత్ర చేపట్టారు. ప్రజల నుంచి సమస్య లు తెలుసుకొని, వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాలనీల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు, నీటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులకు సూ చించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై తక్షణం స్పందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ నాగేందర్, డీఈ నిఖిల్రెడ్డి, జలమండలి మేనేజర్ సత్యనారాయణ, నేతలు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, ఉప్పల్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు వేముల సంతోష్రెడ్డి, ప్రధాన కార్యదర్శి మస్క సుధాకర్, నేతలు టంటం వీరేశ్, అన్య వెంకటేశ్, జహంగీర్, నయా బ్ వెంకట్రావు, స్వీట్హౌజ్ రాజు, గుర్రాల వెంకటేశ్వర్రెడ్డి, మల్లేశ్, కాలనీవాసులు పాల్గొన్నారు.
మౌలిక సదుపాయాలు కల్పిస్తాం..
రామంతాపూర్, డిసెంబర్ 5 : రామంతాపూర్ డివిజన్లోని సాబేరా కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. సోమవారం కాలనీలో అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు.. పలు సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. సాబేరా కాలనీలో మంచినీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ , తదితర సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాలనీల అభివృద్ధికి తమవంతు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం లో కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు, జలమండలి మేనేజర్ జాన్షరీఫ్, మేనేజర్ రవీందర్, టీఆర్ఎస్ నాయకులు గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, డివిజన్ అధ్యక్షుడు ఎండీ ముస్తాక్, గంగిడి కృష్ణారెడ్డి, జహంగీర్, నరేశ్, బాలు, కాలనీ వాసులు ఖాసీం, ఆసిఫ్, ఫయాజ్, నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.