సుల్తాన్బజార్, డిసెంబర్ 3 : దివ్యాంగులను చిన్నచూపు చూడకుండా వారికి తగిన ప్రోత్సాహం అందించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ అన్నారు. దవాఖాన ఆడిటోరియంలో అంతర్జాతీయ వికలా ంగుల దినోత్సవాన్ని పురస్క రించుకొని దవాఖానలోని వివిధ కేడర్లలో విధులు నిర్వహిస్తున్న దివ్యాంగ ఉద్యోగులను సన్మానించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మా ట్లాడుతూ.. దవాఖానలో ఇతర ఉద్యోగులతో వీరు ఏ మాత్రం తక్కువ కాదన్నారు. విధి నిర్వాహణ, సంపాదించే పౌరులుగా సమాజంలో తమ కంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకు ంటున్నారన్నారు. శారీరకంగా వికలాంగులైన ఉద్యోగులు సాధారణ వ్యక్తుల కంటే బలహీనంగా, తక్కువగా భావించాల్సిన అవసరం లేదన్నారు. తమ విలువైన సేవల ద్వారా సమాజానికి దోహదపడుతున్నారని గర్వపడాలని అన్నారు. ప్రతి ఒక్కరూ సమాజంలోని ఇతర దివ్యాంగులను చైతన్యవంతం చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. దవాఖానలో నిత్యం విధి నిర్వహణలో దివ్యాంగ ఉద్యోగుల అమూల్యమైన భాగస్వామ్యం,కృషికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
దివ్యాంగుల కు సన్మానం ..